Saturday, September 27, 2025

A Study of Ratnaprabha-Part- 14 DR. CHILAKAMARTHI DURGA PRASADA RAO,

 

 A Study of Ratnaprabha-Part- 14  

रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय:

{Ratnaprabhaa vimarsha}

 Author: 

DR. CHILAKAMARTHI DURGA PRASADA RAO,

Bhasha praveena , Vedanta vidya Praveena,

M A (Sanskrit), M A (Telugu), M A (Philosophy)

 & Ph D  (Sanskrit)

 

            गताङ्कादग्रे......

            सत्तात्रैविद्ध्यम्

        सर्वेष्वप्यध्यासेषु अज्ञानमेव मूल कारणमिति वक्तव्यम् || एवं सर्वेप्यध्यासा: अनात्माधिष्ठानकाध्यासा: एव || आत्माधिष्ठानकाध्यासस्तु स्वप्नाध्यास: || तथा प्रपञ्चाध्यास: सर्वोऽपि आत्माधिष्ठानक एव ||

तत्राध्यासो द्विविध: प्रातिभासिको व्यावहारिकश्चेति || प्रातिभासिकाध्यासस्तु शुक्तिरजताध्यास: , रज्जुसर्पाध्यासश्च ||

प्रातिभासिकत्वं नाम प्रतिभासासमयवर्तित्वम् || यावद्रजताकार वृत्तित्वं तावदेव रजतस्य स्थितिरित्यर्थ: ||      

 अत एव तत्प्रातिभासिकमुच्यते ||

प्रातिभासिकत्वस्य अन्यं लक्षणमाप्यस्ति ||

ब्रह्मज्ञानेतरबाध्यत्वं प्रातिभासिकत्वमिति ||

ब्रह्मज्ञानेतरेण शुक्तिज्ञानेन रजतं बाध्यते , राजताध्यासो निवर्तते || एवं ब्रह्मज्ञानेतरेण

प्रबोधेन स्वप्नाध्यासो निवर्तते || एवमेव ब्रह्मज्ञानेतरेण रज्जुज्ञानेन सर्पाध्यासो निवर्तते च ||

आगन्तुकदोषजन्यत्वं प्रातिभासिक त्वमित्यप्याचक्षते || आगन्तुकदोषो नाम “ अनादिमूलाज्ञानभिन्नदोष: ” इत्युच्यते || स च काचादि दोष: || नेत्रगतकाचादि दोषवशाच्छुक्तौ राजतादिभ्रमो जायते || आगन्तुकनिद्रादोषवशादात्मनि स्वप्नाध्यासो जायते || एवं प्रातिभासिकाध्यासो विवक्षनीयो भवति ||

               व्यावहारिकाध्यासो नाम मूलाज्ञानजन्योsध्यास: || व्यावहारिकत्वं नाम ब्रह्मज्ञानमात्रबाध्यत्वम् || व्यावहारिकप्रपञ्चभ्रमस्तु ब्रह्मज्ञानेतरेण केनचन नैव निवर्तते || किन्तु ब्रह्मज्ञानेनैव निवर्तते || अत: ब्रह्मज्ञानमात्रबाध्यत्वं व्यावहारिकत्वमित्युपपन्नं भवति || अनादि दोषजन्यत्वमपि व्यावहारिकत्व प्रयोजनम् || व्यावहारिकाध्यासे मूलाविद्यैव दोषत्वेन हेतु: || अत: अनादिदोषजन्यत्वं प्रपञ्चाध्यासे उपपन्नं  भवति || एतादृश मनुभवमनुसृत्यैव सत्यत्वं त्रिविधमित्यु क्तम् ||

1.                 प्रातिभासिकसत्यत्वम्

2.                 व्यावहारिक सत्यत्वम्

          3 पारमार्थिक सत्यत्वम्

अत्र पारमार्थिकसत्यत्वं ब्रह्मण: , व्यावहारिकसत्यत्वं व्यावहारिकप्रपञ्चास्य प्रातिभासिकसत्यत्वं शुक्तिरजत, स्वप्नादीनाम् इति सत्त्तात्रैविध्य पक्षमाश्रित्य व्यवस्था कृता अद्वैते कैश्चित् ||   ... अनुवर्तते....                           

            

A Study of Ratnaprabha-Part-13 by Dr. Ch. DurgaprasadaRao

 

A Study of Ratnaprabha-Part-13

रत्नप्रभाविमर्शे तृतीयोsध्याय:

{Ratnaprabhaa vimarsha}

 

Dr. Ch. DurgaprasadaRao

 

                    अविद्या <> माया

 

सर्वेष्वप्यध्यासेषु अविद्याया: कारणत्वं संभाव्यते || तथा च अविद्या कारणरूपा , अध्यास: कार्यरूप: च || उक्तं भगवत्पादै: तमेवं लक्षणमध्यासं पण्डिता: अविद्येति मन्यन्ते इति || अत्र पण्डिता: इत्यनेन पतञ्जलिप्रभृतयोsभिप्रेता: || तथा हि पातञ्जलं सूत्रम् ||     

 

अनित्याsशुचि दु:खाsनात्मसु नित्यशुचि सुखात्मख्यातिरविद्या ( पा.यो.सू-साधनपाद: -51) इति भाष्यव्याख्यानावसरे अध्यासम्  अविद्याकार्यत्वादविद्येति मन्यन्ते इति अविद्याsध्यासयो: कार्यकारणत्वमुक्तं रत्नप्रभाकारै: ||  

भगवत्पादैस्तु “युष्मदस्मत्प्रयगोचरयो:” इत्यादिना कार्याध्यासमाक्षिप्य, सामग्रीसत्वादनुभवसत्त्वाच्च, ‘तथापि’      इत्यादि -------- अहमिदं ममेदमिति लोकव्यवहार:” इत्यनेन कार्याध्यास: एव प्रदर्शित: ||

अविद्या नाम सत्वरजस्तमोगुणोपेता आवरणविक्षेपशक्तियुक्ता प्रकृति: तादृ शाsविद्यैव कारणाध्यास इत्युच्यते ||      “ इदं रजतम् ” इत्यत्र मूलाविद्यापरतन्त्र तूलाविद्या राजताकारेण , रजतज्ञानाकारेण च परिणमते यदि शुक्ति राजतादीनामविद्यापरिणामित्वमङ्गीकुर्वन्ति || घटपटादिप्रपञ्चस्य तु  साक्षान्मूलाविद्या परिणामित्वमङ्गीकुर्वन्ति || अत एव

मूलाsविद्याया: परिणाम्युपादानत्वं ब्राह्मणस्तु विवर्तोपादनत्वमिति वेदान्तिनामाशय: || तत्त्वतोsन्याथाभाव: परिणाम:   यथा  क्षीरस्य दधिरुपेण परिणाम: || अतत्त्वतोSन्यथाभाव: विवर्त:  यथा रज्जो: सर्पाकारेण प्रतिभास: ||

सर्वस्याप्यविद्यापरिणामित्वादेव सुषुप्त्यवस्थायां लय: , प्रबोधे च पुन: ततो आविर्भाव: इति वेदान्तिनामाशय: ||

अत्र कारणाध्यासमनुक्त्वा केवल कार्याध्यासप्रदर्शने को हेतुरिति चेदुच्यते ||

जीवस्य कार्याध्यास: एवात्यन्तदु:खहेतु: भवति || यदा कार्याध्यासो वर्तते तदैव जीव: बद्धो भवति दु:खमनुभवति || यदा कार्याध्यासो निवर्तते तदा दु:खं नाsनुभवति || यथा गाढसुषुप्तौ  न किञ्चिदवेदिषमिति अनुभवसिद्ध: मूलाज्ञानस्य कारणाध्यास: अस्त्येव || कार्याध्यासस्तु लेशोsपि नास्त्येव || अत: सर्वोऽपि जन्तु: सुखमनुभवति , आनन्दमयकोशे अस्तीति परमार्थ: || अत: दु:खहेतु: कार्याध्यास एव भगवत्पादै: प्रदर्शित: || तदुक्तं रत्नप्रभायाम्

मूलाsविद्याया:  सुषुप्तावानर्थक्यादर्शनात् , कार्यात्मना तस्या: अनर्थत्वज्ञापनार्थं तद्वर्णनमिति भाव: ”  इत्यादि (रत्नप्रभा page-52)

कार्याध्यासस्याविर्भावतिरोभावाभ्यां मूलाज्ञानस्य परिणाम्युपादानत्वं स्पष्टमवगम्यते || तत्र “ मायां तु प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरम् ” (श्वेताश्वतरोपनिषत्-4/10) इति वचनानु सारेण मायाया: प्रकृतित्वं गम्यते ||

सांख्या: अपि वेदान्त्यभिमतां मायामेव प्रधानमिति वदन्त: जगत्कारणत्वं प्रधानस्याभ्युपगच्छन्ति || प्रधानस्य जगत्कारणत्वं नाम जगत्परिणामित्वमेव || प्रधानं महदहङ्कारात्मना परिणमते इति ||

एवमद्वैतिनोsपि माया जगदादि वियदाकारेण    परिणमते इति वदन्ति ||                                         

तथा च प्रधानमाययो: को भेद: इत्यवश्यं 

प्रष्टव्यम् || तत्रेदं समाधानम् ||

सांख्या: ईश्वरं नाsङ्गी कुर्वन्ति || विवर्तवादं  नाsङ्गीकुर्वन्ति || प्रधानं स्वतन्त्रमेव जगत्परिणामि, नेश्वरपरतन्त्रम् ||

अद्वैतिनास्तु माया ईश्वरपरतन्त्रा सती जगदाकारेण परिणमते इति इति वदन्ति ||

अतो माया न स्वतन्त्रा तेषां मते || माया यद्यप्यनादी ब्रह्मज्ञानबाध्यत्वात् सान्तैव || सांख्याभिमतं प्रधानं तु अनाद्यनन्तं च ||

सांख्यमते परिणाम: सर्वोsपि सत्य एव ||

अत: कारणस्य कार्यस्य चोभयोरपि सत्यत्वं स्वीक्रियते तेषां मते ||

अद्वैतमते परमात्मन: विवर्ताधिष्ठानत्वसम्पादनाय मायारुपाविद्याया: परिणाम्युपादानत्वं स्वीकृतम् || किन्तु तेषां परिणामवादे तात्पर्यं नास्ति विवर्तवादे एव तात्पर्यम् ||

अतोsविद्या तत्कार्यञ्च सर्वं ब्रह्मविवर्तमेव ||

बह्मैवाsविद्यात्मना तत्कार्यात्मना च भासते इत्यर्थ: || आरोपितस्याधिष्ठानसत्तातिरिक्तसत्ताकत्वाभावात् , अनाद्यारोपस्य जीवत्वेश्वरत्व, अविद्या-माया संबन्धभेदानामनाद्यारोपाणां, कर्तृत्व – भोक्तृत्ववियदादि प्रपञ्चा ध्यासस्य च आरोपितत्वस्य च समानत्वात् , ब्रहासत्तातिरिक्त सत्ताकत्वsभाव एव || ब्रह्म व्यतिरेकेण किमपि नास्तीत्यर्थ: ||

मायाया: परतन्त्रत्वसूचनार्थं “ मायिनं तु महेश्वरम् ” इत्युक्तं श्रुतौ || अन्यथा सांख्याभिमत प्रधानस्यैव स्वातन्त्र्यं प्रसज्येत || ऐन्द्रजालिका अविद्या न स्वतन्त्रा सती तत्तद्वस्तुरूपेण भासते || ऐन्द्र जालिकसंकल्पसचिवा सती तत्तद्वस्त्वात्मना भासते || तथा मायाsपीत्यलमति विस्तरेण ||                                                                                     <><><>

 

Thursday, September 4, 2025

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం-సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

 

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం

(ఒక విహంగవీక్షణాత్మకసమీక్ష)

గ్రంథరచయిత్రి : శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి,  ఎం.ఏ, ఎం.ఫిల్

సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

M.A (Sanskrit), M.A (Telugu), M.A (Philosophy) & Ph. D (Sanskrit)

 

          నా సహాధ్యాయిని మరియు సోదరీమణి  అయిన శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి గారు రచించిన “త్యాగరాజ కీర్తనలు - పురుషకార వైభవం” అనే గ్రంథం ఆమూలాగ్రం చదివాను. ఇది పన్నెండు అధ్యాయాలతో కూడిన విమర్శనాత్మకమైన గ్రంథం .

ఈ గ్రంథంలో స్వగతం మరియు ఉపసంహారం కాకుండా పన్నెండు అధ్యాయాలున్నాయి .   

1.                  మొదటి అధ్యాయంలో  ‘తెలుగులో పద కవిత్వం’ ; రెండవ  అధ్యాయంలో  ‘పద కవిత్వ క్రమ పరిణామం’ ,  మూడవ అధ్యాయంలో   వాగ్గేయకార లక్షణం – వాగ్గేయకారులు, నాలుగవ అధ్యాయంలో  ‘త్యాగయ్య- జీవితవిశేషాలు’ ఐదవ అధ్యాయంలో , ‘త్యాగయ్యపై రామదాసు ప్రభావం, ఆరవ అధ్యాయంలో   ‘ భక్తి – శరణాగతి’  , ఏడవ అధ్యాయంలో  ‘పురుష కారం – ఆవశ్యకత, ఎనిమిదవ అధ్యాయంలో   ‘ త్యాగయ్య కీర్తనల్లో లక్ష్మీ పురుషకారత్వం , తొమ్మిదవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో ఆచార్యపురుషకారత్వం , పదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో  జానపద గేయ రీతులు,  పదకొండవ అధ్యాయంలో,  త్యాగయ్య కీర్తనలలో భాషా విశేషాలు , పన్నెండవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో సందేశం

పొందుపరిచారు .  ఆ తరువాత ఉపసంహరంలో  అన్నీ సమన్వయం చేశారు.  

ఇక ధర్మ, అర్థ,  కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం సర్వశ్రేష్ఠ౦.  అందుకే అది పరమపురుషార్థమై౦ది . మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది సిద్ధిస్తుంది. అందుకే  ఆపస్తంబ మహర్షి ‘ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్’ అనే మాటల్లో  మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కంటే  ఉన్నతమైన పరమార్థం మరొకటి లేదన్నారు  . ఈ   మోక్ష ప్రాప్తికి,   కర్మభక్తి, జ్ఞానం అనే   మూడు మార్గాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే , మోక్షమనే  సామ్రాజ్యం,  కర్మ, జ్ఞానం, భక్తి అనే ముక్కాలి పీటపై నిలిచి ఉంది .   ఇక,  కర్మలు ఎన్నో విధాలుగా ఉన్నాయి , వాటికి పరిమితి లేదు అవి అనంతములు . అంతే కాక,  కర్మలు ఎంతో ధనవ్యయంతో ముడి పడ్డాయి , అందరు ఆచరించ లేరు . కర్మకాండకు ఎన్నో నియమ నిబంధనలు కూడ ఉన్నాయి . యజ్ఞ, యాగాది కర్మలు అన్ని కులాల వారు ఆచరి౦చలేరు. కర్మకాండకు వయోపరిమితి , ఆశ్రమ నిబంధనలు  ఎన్నో ఉన్నాయి . పోనీ ఎలాగో కష్టపడి కర్మల నాచరి౦చినా, కర్మల వలన పొందేది ఏదీ శాశ్వతం కాదు .  ఇక జ్ఞానం  విషయానికొస్తే అది అందరికీ అందుబాటులో ఉండదు . జ్ఞాన ప్రాప్తికి నిత్యా నిత్య వస్తు వివేకం కావాలి  . లౌకిక సుఖాల పట్ల పారలౌకిక సుఖాల  పట్ల వైరాగ్యం కావాలి .  శమం,  అంటే ఇంద్రియ నిగ్రహం,  దమం అంటే మనో నిగ్రహం , ఉపరతి, అంటే కర్మఫల త్యాగం,   ‘తితిక్ష’  అంటే శీతోష్ణ , సుఖదు:ఖాది ద్వాలను  సహించగలగడం; ‘శ్రద్ధ’ అంటే శాస్త్ర వాక్యాలపట్ల, గురు  వాక్యాలపట్ల అచంచలమైన విశ్వాసం , ‘సమాధానం’ అంటే, ఎటువంటి ఏమరుపాటు లేని నిశ్చలమైన మనస్సు  మొదలైన గుణాలు అలవరచుకోవాలి  . ‘ముముక్షుత్వం’ అంటే మోక్షం పట్ల తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి . ఇవన్నీ అలవాటు చేసుకోవడం  అంత సులభమేమీ కాదు . అందువల్లనే మోక్ష సాధనాల్లో భక్తి,   చాల గొప్పదని శ్రీ శంకరుల వంటి  మహాజ్ఞాని స్వయంగా అంగీకరించారు.  అంతేగాక మనకు,  భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం భక్తి మార్గంలో ప్రయాణం చేసేవారికి  పుష్కలంగా లభిస్తోంది . ప్రతివ్యక్తి, తన   భక్తి భావాలను  ప్రకటి౦చు కోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.

అందుకే భక్తాగ్ర గణ్యులలో ఒకరైన పోతనగారు,

నీ పాద కమలసేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును

తాపస మందార! నాకు దయసేయగదే!   అని వేడుకున్నారు. ఇక భక్తి, జ్ఞాన, కర్మలు ఒకదాని కంటే, మరొకటి వేరుగా లేవు . ఏ ఒక్కటి మిగిలిన రెంటిని విడిచి ఉండదు. కర్మ,   భక్తి జ్ఞానాల్ని ;   భక్తి,   కర్మ జ్ఞానాల్ని ; జ్ఞానం,  భక్తి కర్మలను విడిచి పెడితే అవి సమగ్రాలు అనిపించుకోలేవు.   అంతేగాక ఈ భక్తి,

శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం , వందనం,  దాస్యం , సఖ్యం , ఆత్మనివేదనం అని తొమ్మిది విధాలుగా  కనిపిస్తోంది. ఈ తొమ్మిది మార్గాల్లో ఎవరికి  వీలైన మార్గాన్ని వారు అనుసరించి,  తరించిన మహనీయులు ఎందరో మనకు కనిపిస్తున్నారు. ఇక భక్తిలో ‘కీర్తనం’ అనేది  ఒక ముఖ్య మైన అంశం .

  ‘కీర్తనం’ అంటే భగవంతుని గుణ, గణాలను నోరార, కీర్తించడం.    ఇక  ‘కీర్తన’ ద్వారా తాము తరించి, జాతిని మొత్తం తరింప చేసిన వాగ్గేయకారులు ఎంతోమంది మన పవిత్ర భారత దేశంలో జన్మించారు . వారిలో శ్రీ త్యాగరాజ స్వామి ఒకరు.

ఇక ఈ గ్రంథ రచయిత్రి,  శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మొదటి అధ్యాయంలో పద కవిత్వం యొక్క ఆవిర్భావ వికాసాలను చక్కగా వివరించారు. పదానికి సంగీతం జోడిస్తే కీర్తన అవుతుందని వివరించారు .

రెండవ అధ్యాయంలో ‘పద కవిత’ యొక్క క్రమ పరిణామాన్ని వివరించారు. ఆ సందర్భంలో సంకీర్తనాచార్యులైన    క్షేత్రయ్య , అన్నమయ్య, పురందరదాసు, సారంగపాణి , రామదాసు మొదలగువారి గొప్పదనాన్ని ప్రస్తావించారు.

మూడవ అధ్యాయంలో వాగ్గేయకారుల కవిత లక్షణాల్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ,

సంస్కృత వాగ్గేయకారులైన జయదేవుడు, లీలాశుకుడు , నారాయణ తీర్థులు, కృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు, చిన తిరుమలాచార్యులు, చిన్నన్న, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి మొదలగువారి ప్రతిభను కొనియాడారు. అంతేగాక తమిళంలో ఆళ్వార్లు , నాయన్మారుల యొక్క పద కవితా విశేషాలను, కన్నడంలో సుప్రసిద్ధుడైన పురందరదాసు గొప్పదనాన్ని పరిచయం  చేశారు.

నాల్గవ, అధ్యాయంలో త్యాగరాజ స్వామి జీవిత విశేషాలను వివరిస్తూ ఆయనకు లభించిన శ్రీరామ సాక్షాత్కారం, క్షేత్ర పర్యటన, ఆయన రచించిన  కృతులు,  ఆయన సిద్ధి పొందడం, ఆయన ఆరాధన ఉత్సవ విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా

అభివర్ణించారు.

ఐదవ అధ్యాయంలో త్యాగరాజుపై రామదాసు ప్రభావాన్ని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు.

ఆరవ అధ్యాయంలో భక్తికి, పరాకాష్ఠ రూపమైన శరణాగతి స్వరూపాన్ని           వేద, పురాణ , ఇతిహాస, ద్రావిడ ప్రబంధాలతో బాటుగా; శ్రీ రామానుజాచార్యుల వారి అభిప్రాయాలను కూడ మేళవించి    శరణాగతి యొక్క ప్రాముఖ్యాన్ని  ప్రామాణికంగా నిరూపించారు.  

“ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ:”  

అనే భగవానుని ప్రతిజ్ఞ, ఆయన మనకు ప్రసాదించిన అభయ దానం   సర్వ జన విదితమే కదా !  

              ఏడవ అధ్యాయంలో పురుష కారం యొక్క ప్రాముఖ్యాన్ని చర్చించారు.  మనం,  మన కంటే చాల ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ద్వారా పనులు జరిపించుకోవాలంటే అతనికి చాల ఇష్టులు , సన్నిహితులు ఐన వారిని ఆశ్రయించడం,  లోక సహజమైన విషయం . ఆధ్యాత్మిక విషయంలో కూడ ఇదే పరిపాటి. అయ్య మనసు కంటే, అమ్మ మనసు సుతి మెత్తనిది.   కాబట్టి,  అమ్మ ను అడిగి ఆమె ద్వారా అయ్య వలన పనులు చేయించుకోవడం సర్వసామాన్యం. అందుకే “ నను బ్రోవమని చెప్పవే,  సీతమ్మ తల్లి” అని భక్తులు ముందుగా అమ్మవారిని పొగిడి  ఆమె ద్వారా తమ కోరికలు తీర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా,  స్త్రీ మూర్తి,  సద్య:ప్రసాదిని కదా!        

ఎనిమిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో రామునకు సీతమ్మ , విష్ణువునకు లక్ష్మిపురుష కారం అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు.

తొమ్మిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో ఆచార్య పురుష కారం అనే అంశాన్ని వివరిస్తూ భగవద్భక్తుల ద్వారా భగవానుని ఆశ్రయించాలని వివరించారు. భగవంతుని కన్నా భక్తుడే,  సులభ గ్రాహ్యుడని  అదే సులభమైన మార్గమని వివరించారు .  పదవ  అధ్యాయం లో త్యాగరాజ కీర్తనలలోని జానపద గేయ రీతుల్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదకర్తల రచనలలో గ్రాంథిక , శిష్ట వ్యావహారిక , వ్యావహారిక కీర్తనలను పేర్కొని

వాటి యొక్క సర్వజన ఆమోదకత్వాన్ని నిరూపించారు . త్యాగ రాజ స్వామి రచించిన కీర్తనలలోని ఆచార, వ్యవహారాలను,

సంప్రదాయాలను, దేశి రాగ రీతులను విశ్లే షించారు.

పదునొకండవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలోని భాషావిశేషాలను

వివరించారు.

పన్నెండవ అధ్యాయంలో త్యాగ రాజ స్వామి తన కీర్తనల ద్వారా ప్రజలకు అందించిన  సందేశాన్ని అందమైన మాటలలో పొందుపరచి వీనులకు  విందు చేకూర్చారు.

ఇంకా ఈ గ్రంథంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి . అవన్నీ పాఠకులు స్వయంగా చవివి తెలుసుకోవాలి.  ఈ గ్రంథం ఆమె సునిశితమైన  ప్రజ్ఞకు , వేద, వేదాంగ, వేదాంత శాస్త్ర జ్ఞానానికి , రాగ, తాళ లయాత్మకమైన  సంగీత శాస్త్ర అవగాహనకు దర్పణం అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని సమాజానికి అందించిన ఆమెను మనసారా అభినందిస్తూ , ఆమె కంటే వయస్సులో కొంచెం పెద్దవాడిని కావడం వల్ల ఆశీర్వదిస్తూ.......

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.