Saturday, April 4, 2020

మజ్జిగపులుసు తయారు చేసుకునే విధానం


మజ్జిగపులుసు తయారు చేసుకునే విధానం

శ్రీమతి. చిలకమర్తి లక్ష్మీకుమారి M.A

ఆంధ్రులు అమితంగా ఇష్టపడే పదార్థాల్లో  ‘ మజ్జిగ పులుసు’  ఒకటి . ఇది తయారు చేసే విధానం తెలుసు కుందాం .
ముందుగా కావలసిన పదార్థాలు : ఆనపకాయ, రెండు టమాటాలు, రెండు పచ్చి మిరపకాయలు & కొంచెం కొత్తిమీర.
మూడు కప్పులపెరుగు.

1.                గ్రేవీ (మిశ్రమానికి) కి కావలసినవి.
నాలుగు టీస్పూన్ల పెసరపప్పు లేదా సెనగపప్పు   
రెండుteaspoons ధనియాలు
1/2 స్పూను జీలకర్ర  
½ స్పూను మిరియాలు
అరచెక్క పచ్చి కొబ్బరి ముక్కలు
చిన్నఅల్లం ముక్క
 పోపుసామానులు :
1. స్పూను మినప్పప్పు
¼ మెంతులు, ఆవాలు , కొంచెం  ఇంగువ , రెండు ఎండు మిరపకాయలు
తయారు చేయువిధానం :

ఆనపకాయకు తొక్కతీసి  మీడియం సైజు ముక్కలు చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు , పసుపూ , ఒక ½ స్పూను ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి ఉడికించాలి .ఉడికే వరకు విజిల్స్ రానివ్వాలి .
గ్రేవీకి కావలసిన పదార్థాలను నీళ్ళల్లో వేసి కడిగి  మంచినీళ్ళు పోసి ఒక అరగంట నాన నివ్వాలి , తరువాత వాటిని మిక్సీ చేసుకోవాలి.   అల్లం ముక్క, పచ్చికొబ్బరి కూడ వాటితో కలిపి మిక్సీ చేసుకోవాలి . ఆ మిశ్రమాన్ని మనం మజ్జిగ పులుసు తయారు చేసుకునే మజ్జిగలో కలిపి చిటికెడు పసుపు వేసి స్టౌ మీద పెట్టుకోవాలి . ముందుగా ఉడికించిన ఆనపకాయముక్కల్ని చల్లార బెట్టు కుని ఈ మజ్జిగలో వెయ్యాలి . టమాటాలు , పచ్చిమిరపకాయముక్కలు నూనెలో మగ్గించి కాగుతున్న మజ్జిగపులుసు మిశ్రమంలో వెయ్యాలి. పులుసు చిక్కబడినతరువాత తగినంత  ఉప్పు జోడించి క్రిందకు దింపెయ్యాలి. మూకుడులో రెండు స్పూన్ల  నూనె వేసి అందులో పోపు దినుసులు వేసి , కరివేపాకు  కూడ చేర్చిదోరగా వేగిన పోపు  మజ్జిగపులుసులో వెయ్యాలి . పచ్చి కొత్తిమీరను సన్నగా తరిగి మజ్జిగపులుసు పైన చల్లాలి.


No comments: