Monday, April 6, 2020

గురుపుత్రుని గురుస్తుతి . రచన :-- కీ||శే|| మల్లంపల్లి సుబ్రహ్మణ్య శర్మ


గురుపుత్రుని గురుస్తుతి
రచన :-- కీ||శే|| సుబ్రహ్మణ్య శర్మ

మా గురువర్యులు శివశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్రభాషలలో నిరుపమానమైన పాండిత్యం గలవారు . ఎన్నో మహాకావ్యాలు రచించిన మహాకవి . ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకులు గాను , ప్రిన్సిపాల్ గాను పనిచేయడంతో బాటుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం వంటి అనేక విద్యాసంస్థలకు సెనేట్ మరియు బోర్డు ఆఫ్ స్టడీస్ మె౦బరుగా  భాషాభివృద్ధికి ఎన్నో విశేష సేవలందించిన మహామనీషి . ఉత్తరనైషధం , ఉత్తమమనుసంభవం, కాంచీ ఖండం వంటి మహాకావ్యాలే గాక ఎన్నో ఖండకావ్యాలు వెలయించిన  కవిసార్వ భౌములు. వారి పుత్రుడు శ్రీ సుబ్రహ్మణ్య శర్మ తమ తండ్రి గారిపై రచించిన రెండు పద్యాలు నాకు లభించాయి . అవి మీకు అందిస్తున్నాను .    
    
జనివిద్యాస్థితులందు( దా గురువుగా శశ్వత్సమారాధ్యుడై
ఘనశక్తిన్ గలిగించు నీశ్వరుని నుగ్రంపశ్యశీర్ష స్థలీ
వినివేశ ప్రవిభాసమాన హిమరుగ్వి ద్యోతిత జ్యోత్స్నికా
కనదుద్యద్యశు గొల్తు మా జనకునిన్ గావ్యజ్ఞు వీరేశ్వరున్

ప్రతిభావంబును మానసంబు మది జేరన్వచ్చి యా వెంట న
ద్ది తిరోభుతమగున్ వచ: పరిణతి స్తేమంబుగా దెందునన్
మతి చిత్త్తంబులదేని దోషగుణ సామర్థ్య౦ బొ నాయందు శ
ర్వ ! తనర్పన్వలె నీ కృపా ప్రసృతి మార్కండేయ! విశ్వేశ్వరా!
  
                                చిలకమర్తి . దుర్గాప్రసాదరావు   


No comments: