Thursday, February 13, 2025

అనుభవాలు -జ్ఞాపకాలు -10 by Dr. Chilakamarthi Durgaprasada Rao.

 

అనుభవాలు -జ్ఞాపకాలు -10

                         Dr. Chilakamarthi Durgaprasada Rao. 

 

నేను ANR college లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ప్రిన్సిపాల్ Dr. Y. వేంకటేశ్వరరావు గారు పిలిచారు. వెళ్లి కూర్చున్నాను . ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.   ఏం లేదయ్యా!  రాముల వారు వాళ్ళ అమ్మ కడుపులో ప్రవేశించినప్పుడు కొంతమంది దేవతలు ఆమె గర్భంలో ప్రవేశించారని చదివాను. అలాగే బుద్ధుడు వాళ్ళ అమ్మ కడుపులో ప్రవేశించి నప్పుడు కూడ కొంతమంది దేవీ దేవతలు అతని తల్లి గర్భంలో ప్రవేశించారని చదివాను. ఈయనెవడయ్యా! బాబు? గట్టిగా గాలేస్తే పడిపోయే మనిషి. Kettle అనే పదం స్పెల్లింగ్ కూడ తెలియని మనిషి. హిమాలయ పర్వతం కూడ తలెత్తి చూస్తే గాని కనిపించనంత ఉన్నతమైన  వ్యక్తిగా ఎదిగాడు. మానవ మాత్రుడు కాడయ్యా  అన్నారు.   ఆ మాటలు విన్న నాకు   Future generations scarcely  believe that a man of this calibre with flesh and blood has ever walked on the earth. అన్న Einstein మాటలు;  Gandhi was inevitable. If humanity is to progress, Gandhi is inescapable. … we may ignore him at our own risk. అన్న Dr. martin Luther King, jr. మాటలు; గాంధీ మరణానంతరం ఆంగ్లేయులు మన వాళ్ళతో  “మేం ఆయను అరవై సంవత్సరాల పాటు కాపాడేం. మీరు కనీసం ఆరు నెలలు కూడ కాపాడుకోలేక పోయారు” అని మృదువుగా చీవాట్లు పెడుతూ పలికిన మాటలు  స్ఫురణకు వచ్చాయి. ఆయనను మన కన్నా విదేశీయులే బాగా అర్థం చేసుకున్నారని అనుకున్నాను .  ఎప్పటికైనా ఆయన సంచరించిన ప్రదేశంలో  ఒకసారి అడుగు పెట్టే అవకాశం కలుగుతుందా అనుకునేవాణ్ణి . చాల  సార్లు ‘వార్ధా’ నగరం మీదుగా రైలులో ప్రయాణం చేసినా దిగే అవకాశం కలగలేదు .

ఒకనాడు వార్ధాలో ఉన్న గాంధీ institute లో అన్ని మతాలకు సంబంధించిన ఒక సమావేశం జరుగుతోందని, ఆసక్తి కలవారు పాల్గోవచ్చని ఒక circular వచ్చింది. గాంధీ గారు తనను ఎవరికైనా ఎప్పుడయినా పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడు I am a Sanatanee Hindu అని మాత్రమె పరిచయం చేసుకునే వారు.  అయినా ఆయనలో సర్వధర్మసమతా భావం ఉండేది. అందుకే వారి పేర ఇటువంటి సభలు నిర్వహించడం పరిపాటి. నేనుTheology చెపుతున్నాను కాబట్టి అది నా దాక వచ్చింది.  ఇదే  అవకాశం అనుకున్నాను. నేను మరికొంతమంది బయలుదేరాం . అక్కడకు చేరుకున్నాం. మాతో పాటు కొంతమంది విదేశాలనుండి కూడ వచ్చారు.

అది మహాత్ముని ఆశ్రమం. సమావేశాలు ప్రారంభమయ్యాయి . ఒక్కొక్క session ఒక్కొక్క మతానికి కేటాయించారు. భారతదేశంలో ఆయా  మతాలపై మాట్లాడ గల వారిలో ఉత్తమ వ్యక్తులను ఒక్కొక్కరి చొప్పున  వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసి పిలిచారు .   రోజుకు రెండు session లు చొప్పున జరిగాయి. అందరు వారి మతం గురించి చెప్పేరే గాని పర మత దూషణ చెయ్య లేదు.     ఖాళీ సమయాల్లో ఆ సమీపంలోనే ఉన్న(8K.M) సేవాగ్రాం లోని  గాంధీ ఆశ్రమానికి కొంతమంది మిత్రులతో కలిసి వెళ్ళడం ఒక అలవాటుగా మారింది .

గాంధీజీ ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు  అక్కడ ఉండే గ్రామస్థుల అనుమతితో అక్కడ ఒక వారం రోజులపాటు ఉండేవారని, సేవా కార్యక్రమాలు  నిర్వహించేవారని అదే సేవాగ్రామంగా మారిందని చెప్పేరు. అక్కడ మహాత్మునకు  సంబంధించినవి ఎన్నో వస్తువులున్నాయి.  మహాత్మాగాంధి తనకు సంస్కృతం రాకపోవడం వల్ల ఆచార్య వినోభాబావే గారి వద్ద భగవద్గీత చదువుకునే వారని అక్కడి వాళ్ళు చెప్పేరు.

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గార్ని ప్రధాన మంత్రి చెయ్యడంలో గాంధీ గారి ఉద్దేశ్యం ఏమిటని నాకు తెలిసీ తెలియని హిందీలో అడిగాను .

దానికి సమాధానంగా ఆ సమయంలో మహాత్ముడు ఎవరికో చెప్పిన  మాటలనే వారు నాకు వినిపించారు . స్వాతంత్ర్యం వచ్చాక గాంధీగారు congress పార్టీ ని dissolve చెయ్యమని అడిగారు. ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు . ఆయన కూడ తటస్థంగానే ఉండిపోయారు . ఎందుకంటే ఆయన లక్ష్యం నెరవేరింది . అందరు డిల్లీలో దేశ స్వాతంత్ర్యపు సంబరాలు ఘనంగా జరుపుకుంటు ఉంటే ఆయన నౌఖాలీలో మఱుగు దొడ్లు శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారట.

ఇక సర్దార్ వల్లభ భాయ్ పటేల్ , పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇద్దరు చాల గొప్పవారే సమానులే. వారిద్దరూ నాకు రెండు కళ్ళు . నాకు (అంటే దేశానికి)  ఇద్దరి సేవలు కావాలి. కాని వారి ఇద్దరిలో ఒక పెద్ద తేడా ఉంది . నెహ్రూ తనకు తక్కువ స్థానం ఇస్తే సహించ లేడు. పార్టీ వదిలి వెళ్ళి పోతాడు . కాని పటేల్ అలాంటి వాడు  కాదు. ఆయనకు  position ముఖ్యం కాదు . సేవే ముఖ్యం . ఆయన  ఏ స్థానం లో ఉన్నా దేశానికి సేవ చేస్తాడు. ఒకవేళ పటేల్ కి ఉన్నత స్థానం కట్టబెడితే నెహ్రూని కోల్పోవలసి వస్తుంది  అన్నారట. అది విన్నాక నాకనిపించింది. ప్రతి వాడు వాడి స్థాయిని బట్టి ఇతరుల్ని అంచనా వేస్తాడు, మహాత్ముడు మహాత్ముడే మామూలోడు మామూలోడే అని. ఈ మధ్య ఎవరి దగ్గరో ఈ విషయాన్నే ప్రస్తావిస్తే ఇవే విషయాలు చెప్పేరు . అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి.

ఇక seminar విషయాని కొస్తే వాళ్ళ వారి అందరి మాటల్ని బట్టి ఒక విషయం నాకు  తెలిసింది. ప్రతి మతానుయాయి వాళ్ళకు అనుకూలంగా మతాన్ని మార్చుకుంటున్నారని వారందరూ ఏకగ్రీవంగా సిద్ధాంతీకరించారు. ఎవరూ తమ యొక్క  మత సిద్ధాంతాల్ని తు.చ తప్పకుండా అనుసరించడం లేదని అందరు అవకాశ వాదులే అని అన్నారు. ఒకాయన ఇస్లాం మతం గురించి చాల చక్కగా వ్యాఖ్యానించారు. భగవంతుడు అల్లా అన్నారు. అది కేవలం మతావిష్కరణ సదస్సు. అక్కడ వాద, వివాదాలకు చోటు లేదు . అయినా నేను సభలోనే అడిగాను ‘రాముడు ఎవరండీ’ అని దానికాయన “ రాముడు మర్యాదాపురుషోత్తముడండీ” అన్నారు .’కృష్ణుడు ఎవరండీ’ అన్నాను .”ఆయన కర్మయోగి, యోగీశ్వరుడు  అన్నారు. ఎవరి మతం వారిదే కాబట్టి వాద, వివాదాలు జరగలేదు .             

                                        <><><> 

 

Wednesday, February 12, 2025

Seva is supreme. Dr. Ch. Durgaprasada Rao

 

'Seva' is supreme

Dr. Ch. Durgaprasada Rao

 

Man is mortal. There is no doubt about it. But Upanishads declare that man can become immortal neither by performing yagas, nor by begetting children, nor even by possessing wealth but by sacrificing his possessions alone in the form of seva. 

न कर्मणा न प्रजया धनेन त्यागेनैकेनाsमृतत्त्वमानाशु:

(कठ उपनिषद )

Following the footsteps of the teaching of the Upanishads, Bhagan Vyasa also states in the Mahabharata that the golden flowers, produced by Mother Earth are enjoyed by three persons. One is a warrior; the other one is educated and still the other one is a person who knows how to serve others.

 

सुवर्णपुष्पां  पृथिवीं चिन्वन्ति पुरुषास्त्रय:

शूरश्च कृतविद्यश्च यश्च जानाति सेवितुम्  

 

Therefore, seva is the supreme and comparatively the easiest way to enjoy the olden fruits of this Mother Earth.

Moreover, seva done to one’s own guru with reverence is said to be the seva done to the whole humanity at large as Guru is none other than the embodiment of Universal Consciousness.

To achieve immortality, seva should be rendered towards one’s own Guru by way of तन (physically), मन (mentally) and धन (by spending wealth for the good of the community).

People who are hale and healthy and physically sound can serve their Guru by services.      Persons who are not sound physically can contribute their seva by prayers and other essential services. People who cannot afford both but financially sound can serve Guru by spending wealth for the benefit of the community. Whatever the means it may be, contributing something for the good of community through guru is said to the supreme dharma and that alone makes man immortal.

सेवाधर्म: भवति सुगम: योगिनामप्यगम्य: { seva is easier than all the other means and it is not accessible even for yogis}  

<><><>   

 

 

 

Wednesday, February 5, 2025

వ్యక్తిత్వం –వకారపంచకం డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

వ్యక్తిత్వం –వకారపంచకం

 

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన 

వకార పంచకేనైవ నరో భవతి పూజిత:”

 

అన్నారు మన పెద్దలు . అంటే మనిషి వ్యక్తిత్వాన్నిసూచించే  అంశాలు ఐదు ఉన్నాయి.  అవే౦టంటే వస్త్రం , రూపం , మాటతీరు , విద్య , వినయం  అనేవి . వాటిగురించి క్రమంగా తెలుసుకుందాం .   

 

1.     వస్త్రం : 

మొదటిది వస్త్రం ఒక మనిషి ధరించే బట్టల వల్ల అతడు ఎటువంటి వాడో చాలవరకు అందరికి తెలుస్తుంది . అందువల్ల ప్రతివ్యక్తి తనకున్నంతలో  ఎప్పుడు పరిశుభ్రమైన బట్టలనే  ధరించాలిమురికి బట్టలు వేసుకో కూడదు .  మంచి బట్టలే వేసుకోవాలి  .  బట్టలు వ్యక్తి  యొక్క హుందాతనాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి . ఇక్కడ మంచిబట్టలంటే ఖరీదైన బట్టలని కాదు పరిశుభ్రమైన బట్టలని మాత్రమే  . సమాజంలో   కొంతమంది బట్టలను బట్టి గౌరవించేవారు కూడ ఉంటారు. బట్టలను బట్టి వ్యక్తిని అంచనా వేయడం కేవలం మనుషుల్లోనే కాదు దేవతల్లో కూడ ఉంది .    ఇక మనుషుల సంగతి  వేరే చెప్పాలా!

విష్ణుమూర్తి పీతాంబరుడు కాబట్టి సముద్రుడు పిలిచి పిల్లనిచ్చాడని శివుడు గజచర్మధారి కాబట్టి విషం ఇచ్చాడని మన పెద్దలు చమత్కరించారు . ఈ విషయాన్ని వివరిస్తూ ఎప్పుడో నేనొక పద్యం కూడ వ్రాశాను .

 

భువిలో యోగ్యతకన్న వస్త్రమునకొప్పున్ భూషణాధిక్య గౌ

రవముల్ పచ్చని బట్టవానికి మహద్ రాగంబుతోడందనూ

భవనిచ్చెన్ గజచార్మధారియగు నా ఫాలాక్షుకాత్మోత్థీతో

గ్రవిషంబిచ్చె నదీకళత్రుడట వస్త్రంబే ప్రధానంబుగన్

 

అందువల్ల పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలిఎవరు ఆక్షేపించే   విధంగా ఉ౦డకూడదు .



కుచేలినం దంతమలాపహాసినం

బహ్వాశన౦ నిష్ఠురవాక్యభాషిణ౦

సూర్యోదయే చాస్తమాయే చ శాయినం

విముంచతి శ్రీ రపి చక్రపాణిన౦



అనే సూక్తి ఒకటుంది . మాసిపోయిన బట్టలు వేసుకున్న వాణ్ణి, ముఖం కడుక్కోని వాణ్ణి,  అతిగా తినే వాణ్ణి,  కఠినంగా మాట్లాడేవాణ్ణి, సూర్యోదయ - సూర్యాస్తమయ వేళల్లో పడుకునే వాణ్ణి లక్ష్మి దరిజేరదట. ఒక వేళ ఆ పనులు విష్ణువు చేస్తున్నా అతన్ని విడిచి పెట్టేస్తు౦దట.     

ఇక ఈ కాలంలో  కొంతమంది ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన , అర్ధనగ్నంగా ఉండే బట్టలు ధరిస్తున్నారు .!  ఒకడు ముందు in-shirt చేసు కున్నాడు . వెనకాల in-shirt చేసుకోలేదు. వాడి స్నేహితుడు అడిగాడు ఏరా! ముందు in-shirt ఎందుకు చేసుకున్నావు ? సమాధానం: - చొక్కాచిరిగి పోయింది  . మరి వెనుక in-shirt ఎందుకు  చేసుకోలేదు ? పేంటు చిరిగిపోయింది . ఇదీ సమాధానం .  ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే నామోషి . కాని ఇప్పుడు బట్టలు చింపుకుని మరీ వేసుకుంటున్నారు . ఇది మరీ విడ్డూరం . కాబట్టి మనిషి ఇతరులు ఆక్షేపించే విధంగా కాకుండా పరిశుభ్రమైనవి , సంస్కారం ఉట్టి పడేటటువంటి   బట్టలు ధరించాలి.

 

2. రూపం :-  ఇది రెండో అంశం .  మనిషి రూపాన్ని బట్టి కూడ ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. యత్రాకృతి: తత్ర గుణా: భవంతి అన్నారు మన పెద్దలు . ఎక్కడ రూపం ఉంటుందో అక్కడ గుణాలు కూడ ఉంటాయని ప్రతీతి .  అంటే అందంగా ఉన్న ప్రతివాడు మంచివాడని  అందవికారంగా ఉన్నవాడు చెడ్డవాడని అర్థంకాదు . రూపం గుణాన్ని చాటే అంశాల్లో ఒకటని  మాత్రమే. అందువల్ల ప్రతిమనిషి తనకున్నంతలో అందంగా , హుందాగా  గంబీరంగా కనిపించాలి .



౩. వాక్కు :- ఇది మూడోది . మనిషి వ్యక్తిత్వం మాటతీరును బట్టి చెప్పొచ్చు . కొంతమంది మృదువుగా మాట్లాడతారు , కొంతమంది కఠినంగా మాట్లాడతారు . ఎంతో కఠినమైన విషయాన్ని కూడ మృదువుగా చెప్పొచ్చు . కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని చాల కఠోరంగా మాట్లాడతారు . అందువల్ల ఇతరులకు బాధకలగకుండా మాట్లాడ గలగాలి .

 

4. విద్య :-  ఇది నాల్గో అంశం .

         మనిషికి విద్య నిజమైన అలంకారం . విద్యలేని వాడు వింతపశువు అన్నారు మన పెద్దలు . ఇప్పుడు చదువుకొన్నవాడు సంతపశువుగా ప్రవర్తిస్తున్నాడు . సరే ! ఆ విషయం అలా ఉంచుదాం .  ప్రతి తల్లి , తండ్రి తమపిల్లల్ని విధిగా చదివి౦చాలి.

"మాతా శతుర్ : పితా వైరీ యేన బాలో న పాఠిత:

న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా" అంటుంది పంచతంత్రం .

 

పిల్లల్ని చదివి౦చని తల్లి , తండ్రి వారి పాలిట శత్రువులట. ఎందుకంటే  చదువులేని వాడు సమాజంలో హంసలమధ్య కొంగలా తేలిపోతాడట. అంతేకాకుండా పుత్ర: శత్రు: అపండిత: అని కూడ చెబుతుంది పంచతంత్రం   . అంటే చదువుకోని కుమారుడు, కుమార్తె  తల్లితండ్రుల  పాలిట శత్రువులట . అందువల్ల తల్లి దండ్రులు విధిగా తమపిల్లల్ని చదివించాలి . పిల్లలు విధిగా చదువుకోవాలి .

 

5. వినయం :- ఇది ఐదవ అంశం . చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు వినయం కూడ అంతే ముఖ్యం. అందువల్ల మనిషి ఎంత విద్యావంతుడౌతాడో   అంత వినయవంతుడు కూడ కావాలి . వినయంలేని విద్య వాసన లేని పువ్వు వంటిది . అది ఎవరికీ ఉపయోగ పడదు . తనకు కూడ ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది .  మనిషి ఈ ఐదు అంశాలను పరిశీలించి తగిన విధంగా జాగ్రత్తగా మసలుకుంటే అది వ్యక్తిత్వవికాసానికి దోహదం చేస్తుంది .         

                                                >>>>><<<<<