Sunday, December 15, 2013

బాబోయ్ ప్రబంధసుందరి


బాబోయ్ ప్రబంధసుందరి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

మహాకావ్యాల్లో పద్దెనిమిది వర్ణనలుంటయి. వాటిలో స్త్రీ వర్ణన ఒకటి. ముఖ్యంగా ఆ కావ్యం లోని నాయిక వర్ణన అందులో చోటు చేసు కుంటుంది. ప్రాచీనకవులందఱు స్త్రీని చాల పవిత్రంగాను సహజంగాను వర్ణించారు. కాని రానురాను ప్రబంధకవుల వర్ణనలు వెర్రి తలలువేశాయి. వాళ్లు ఏ అవయవాన్నీ విడిచిపెట్టలేదు. ఎటువంటి ఔచిత్యం పాటించ లేదు. నిజంగా ఆ వర్ణనలు తలచుకున్నా బొమ్మ గీసి చూసుకున్నా చాల అసహ్యంగా అనిపిస్తాయి కనిపిస్తాయి .
ముఖ్యంగా కవులందరికి పద్మాలు చాల లోకువగా దొరికాయి. అన్ని అవయవాలను పద్మాలతోనే పోల్చి వర్ణించడం మొదలెట్టారు.
ఆమె ముఖం, కళ్లు , కాళ్లు , చేతులు అన్నీ పద్మాలతోనే పోల్చారు. అ వర్ణనలను ఆక్షేపిస్తూ ఒక ఆధునిక కవి చాల చక్కని పద్యం చెప్పేరు.
ఆమె మొగం తామరట , కన్ను తామరలో దూరిన మరో తామరట. కాళ్లు తామరలట, చేతులుకూడ తామరలే యట . ఇంతవిడ్డూరం ఎక్కడైన ఉంటుందా! మనం మొలతామర (గోక్కునే తామర) ఒక్కటే విన్నాం . ఈ విధంగా శరీరం అంతా తామరలున్న ఆ స్త్రీ నిజంగా దూలగొండే (forget me not) అవుతుంది . ఆటువంటిది వద్దు బాబోయ్ అసలొద్దు.

అటు పయి మోము తామరట అక్షియు తామరలోన తామరే
యట చరణంబు తామరయె యంట కరంబును తామరంట యిం
తటి విపరీతమున్నె మొలదామరవింటిమి గాని మేనియం
తటనిటు తామరల్గలుగు తన్వి నిజంబుగ దూలగొండియే








No comments: