Friday, May 28, 2021

హృద్యం-తెనుగు పద్యం -4 (ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


  

హృద్యం-తెనుగు పద్యం -4

(ఒకరికి కుడుములు మరొకరికి ఇడుములు)


డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు

గత శతాబ్దానికి చెందిన తెనుగు కవులలో  శ్రీ మాధవపెద్ది బుచ్చి సు౦దరరామశాస్త్రి గారొకరు . ఆయన  గొప్ప శివభక్తులు . ఆయన తమ జీవితమంతా కటిక పేదరికంతోను , కష్టాలతోను  గడిపి ఉంటారని ఈ శతకం లోని కొన్ని పద్యాల వల్ల  మనకు తెలుస్తోంది. శివుణ్ణి ఎంత చమత్కారంగా దెప్పి పొడుస్తున్నారో గమనిస్తే కవి గారి ఆవేదన పాఠకుల మనస్సులో మెదిలి గుండె కరిగి నీరై పోతుంది . భక్తీ , ఆవేదన , ఈసడింపు, ఆశాభావం , నిరాశ,  వెక్కిరి౦పులతో కూడిన  ఈ శతకం  ఆయన  ప్రతిభకు ఒక దర్పణoగా నిలుస్తోంది . ముందుగా పద్యం .

 

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు చా

లకకాబోలును సృష్టి చేసితివి ఈ లంబోదరుo గూడ తీ

గకు కాయల్  బరువౌన కానీ , కుడుముల్ కల్పించి యవ్వానికే

లొకొ  యివ్వానికి నొక్క మైని యిడుముల్  మోల్పిo తు మృత్జయా !

ఓ శివా నీకు ఒక లంబోదరుడైన పుత్రుడు( వినాయకుడు ) న్నాడు  చాలడా . మరలా మరొక లంబోదరుణ్ణి (నన్ను) సృష్టించావు .  తీగకు కాయలు బరువుకాదు  . నువ్వు ఆయనకు కుడుములు కల్పిమ్చావు నాకు మాత్రం  యిడుములు (కష్టాలు ) మొలిపిస్తున్నావు . ఇదెక్కడి న్యాయం . నువ్వే చెప్పు అన్నాడు .

ఇటువంటి చమత్కారాలని మనం నేటి తరానికి వివరించాలి .  

ఇటువంటి మహాకవుల  భావనల ను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిo చకపోతే రాబోయే  తరాలు  మనల్ని క్షమించవు  .       

 

No comments: